పవిత్ర సంగమం ఘాట్ , ఫెర్రీ ,ఇబ్రహింపట్నం దగ్గర ,ఆంధ్ర
ప్రదేశ్ పుష్కర ఏర్పాట్లు చక్కగా చేసారు. భక్తులను కొండపల్లి రైల్వే స్టేషన్
లగాయతు పుష్కర ఘాట్ వరకు తిరిగి వారిని అక్కడ నుండి కొండపల్లి రైల్వే స్టేషన్ కు
RTC బస్సులలో ఉచిత ప్రయాణం కలిపించారు. వైద్య సదుపాయము ,మంచి నీటి సరఫరా ,భోజన
వసతి , అలాగే స్నానమాచరించే చోట,పిండాలను కలిపే చోట,కార్ పార్కింగ్ చక్కని ఏర్పాట్లు చేసారు.
సంతోషం – కాని పిందప్రదనాలు చేసే చోట పురోహితులు కూర్చొనె
చోట ఒక పద్దతి లేకుండా పోయింది . అంత
ప్రదేశం ను చిన్న,చిన్న ,క్యాబిన్ లుగా విభజిస్తే బాగుండేది. అలాగే , మైకు లో
భక్తులకు జాగర్తలు చెప్పే తీరు ఒక హోరు లా మారి, పురోహితుడు ఏమి మంత్రం మనలను
అనమంటున్నారో ,వినిపించని పరిస్థితి !
ఇక పురోహితుల
విషయానికి వస్తే , వారికి స్తానికంగా వున్నా పోరోహిత్యం వల్ల , వారి ఖాతా దారులు
సహజముగా వారి వద్ద కే వెళతారు, కొత్త గా వచ్చే భక్తులకు ,మిగిలిన స్తానిక పురోహితులకు
,మిగతా వూళ్ళ నుండి వచ్చిన పురోహితులతాకిడితో ,
వీరి ఆదాయం కు గండి పడే పరిస్థితి ఉన్నది .
ఇక పోతే , భక్తుల
విషయం కు వస్తే , ఒక భక్తుడు తన పూర్వీకులు 32 మంది కి పేర్లకు పిండప్రదానం చేయంచి
, దాదాపు 30నిమిషాల కాలం వేచ్చిస్తే,రు.300/చేతిలో పెడితే , ఆ పురోహితుడి మొఖం
చూడా లి పాపం . అదే మంటే ,గవర్నమెంట్ మెంట్ నిర్ణయించిన ధర అంతే కదా అన్నాడు. పోనీ
, అలా గని మూసి వాయినాలు ,సంకల్ప కు ,గవర్నమెంట్ మెంట్ నిర్ణయించిన ధర ఇస్తున్నారా
అంటే అదీ లేదు.
ఇదిలావుంటే ,మరొక
అయ్యగారి విషయం – పిండప్రదానాలను , స్టీల్ పల్లెము లో చేయించి , అదే ప్లేట్ ను
మిగత వారికి వాడుతున్నంట్లుగా సమాచారం .
ఇది సంగతి.
No comments:
Post a Comment