Tuesday, October 10, 2017

ఒక రైతు తన పొలంలో పని చే

[20:32, 10/4/2017] +91 72072 53159: ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి,
వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి "HELP, HELP" అని అరుస్తూ ఉంటాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు..
తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగుతుంది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు,
ఎవరు బాబు మీరు?? ఎవరు కావాలి?? అని అడుగుతాడు రైతు.
"నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి" అంటూ ఒక ఇనప్పెట్టె ఇస్తాడు,
అప్పుడు రైతు "క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనయిన సాయం చేసాను, అది మనిషిగా నా ధర్మం, " అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు.
ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు,
ఈ అబ్బాయి నీ కొడుకా?? ఏం చదువుతున్నాడు?? అని అడుగుతాడు పెద్దమనిషి.
"అవునండి నా కొడుకే, కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు, ఇపుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతుంటాడు" అంటాడు రైతు.
"అలాగా, అయితే నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను, నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీ ఋణం కొంతయినా తీర్చుకోనివ్వు" అంటాడు.
ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు.
పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివిస్తాడు, వాళ్ళిద్దరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు,
కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది,
డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు, అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు.
ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా??
పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త
"Alexander Fleming"..!!!
ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా??
బ్రిటీష్ ప్రధాన మంత్రి
" Winston Churchil"
అందుకే అంటారు
" పుణ్యం వూరికే పోదు, కలకాలం తోడొస్తుంది" అని.!!
Share this if u like  ...
Help others God will help you...
Finally Justice & Dharma will lead Univers.
[20:40, 10/4/2017] Penction Kameswsrarao: 👍
👍
🙏
[20:42, 10/4/2017] Ravi Prakaash: 

Sunday, September 3, 2017

Kalyanasundaram

Kalyanasundaram honoured by US Govt. I feel equally ashamed that India Govt has conferred 'Bharat Ratna' on Sachin Tendulkar, who seeks and gets exemption of customs duty on a 'Ferrari' which he got free, who reportedly earns crores of rupees(in hundreds) every year.
Mr.Kalayanasundaram worked as a Librarian for 30 years. Every month in his 30 year experience (service), he donated his entire salary to help the needy. He worked as a server in a hotel to meet his needs. He donated even his pension amount of about ten lakh rupees to the needy.
.
He is the first person in the world to spend the entire earnings for a social cause. In recognition to his service, the American government honoured him with the ‘Man of the Millennium’ award. He received a sum of Rs 30 crores as part of this award which he distributed entirely for the needy as usual.
Moved by his passion to help others, Super Star Rajinikanth adopted him as his father. He still stays as a bachelor and dedicated his entire life for serving the society.
.
All our Politicians, Film stars, Business magnets, cricketers Press and we all Indians should be PROUD and also should be ashamed of ourselves. American Government has honored him but we Indians even don't know that such a personality exist amongst us.
.
Atleast have the courtesy to pass this on and on till the whole world comes to know about this Great Good Samaritan.
Hat's off Kalayanasundaram.. We Indians are extremely proud of you and proudly say "THIS HAPPENS ONLY IN INDIA".
.
http://www.viralindiandiary.com/the-man-of-the-millennium-palam-kalyanasundaram/⁠⁠⁠⁠

ధర్మో రక్షతి రక్షితః-story

ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు . అప్పుడు భార్య చెప్పింది.
"నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో  తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది."

ఇంటి యజమానిపరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు.
మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.

ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.

"యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు" అన్నాడాయన.

 ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
ఆయన భార్యకు ఇది నచ్చలేదు.
"మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.
అర్కసోమయాజి ససేమిరా అన్నాడు.
చివరికి ఆమె కోపంతో *పుట్టింటికి పయనమైంది.
ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.

ఊరి పొలిమేర దాటాడో లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.
అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.

అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.

"ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి,  ధర్మ హీనులను ధ్వంసంచేశాను." అన్నాడు కలిపురుషుడు.

...ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే...

II ధర్మో రక్షతి రక్షితః II⁠⁠⁠⁠

Saturday, August 5, 2017

GK

🔲GK

వర్డ్                           ఫుల్ ఫార్మ్

1.e-mail                  ఎలక్ట్రానిక్ మెయిల్

2.WWW                  వరల్డ్ వైడ్ వెబ్

3.HTML                  హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్

4.HTTP                   హైపర్ టెక్ట్స్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్

5.URL                       యూనిఫారం రీసోర్స్ లోకేటర్

6.FTP                      ఫైల్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్

7.AI                       ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్

8.e-commerce        ఎలక్ట్రానిక్ కామర్స్

9.e-business            ఎలక్ట్రానిక్ బిజినెస్

10.e-money            ఎలక్ట్రానిక్ మనీ

11.Internet           ఇంటర్నేషనల్ నెట్ వర్క్

12.ERNET                ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్ వర్క్

13.DVD                     డిజిటల్ వర్సటైల్ డిస్క్

14.BPO                     బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్

15.KPO                     నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్

16.ALGOL               ఆల్గరిదమిక్ లాంగ్వేజ్

17.CDN                     కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్

18.LAN                     లోకల్ ఏరియా నెట్ వర్క్

19.SWAN                 స్టేట్ వైడ్ ఏరియా నెట్ వర్క్

20.WLL                     వైర్ లెస్ లోకల్ లూప్

21.WLAN                 వైర్ లెస్ లోకల్ ఏరియా నెట్ వర్క్

22.XML                   ఎక్స్ టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్

23.LCD                   లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే

24.Wi-Fi             వైర్ లెస్ ఫిడలిటి

25.DTH              డైరెక్ట్-టు-హోమ్

26.CDMA            కోడ్ డివిజన్ మల్టిబుల్ యాక్సెస్⁠⁠⁠⁠

మహాభారతం" నుండి నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు

"మహాభారతం" నుండి

నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు

1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.

2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:
శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.

3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:
పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.

4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.

5. ఎవరి పనులు వారే చేసుకోవడం:
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.

6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు

7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.

8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.

10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.

11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అ… Read more⁠⁠⁠⁠

భక్తి తత్వం- ప్రత్యక్షానుభూతి

[8:53 PM, 8/5/2017] Mahendra Vada: భక్తి- ప్రత్యక్షానుభూతి(1):భక్తిని గురించి మాట్లాడదాం. కొద్ది కాలం కింద బృందావనంలో ఒక గొప్ప సాధకురాలు వుండేదిట. ఇప్పటికి ఆ తపస్విని ఇంటిని సాధకులు పుణ్యక్షేత్రంలా దర్శిస్తూ వుంటారు. ఆమె రాధాకృష్ణులని చిన్నపిల్లలుగా, నిజమైన బిడ్డలుగా భావిస్తూ పూజిస్తుండేది. వాళ్ళకి పాలుపెరుగులు పెట్టడం, స్నానం చేయించడం ఇలా ఎన్నో! ఇవన్నీ ఏదో విగ్రహాలకు చేయిస్తున్నట్టు కాక నిజంగా రాధా కృష్ణులు వున్నట్టు, వారికి అన్నం ముద్దలు పెడుతున్నట్టు ప్రవర్తిస్తుండేది. మొదట్లో ఇదంతా భ్రమ, మతిభ్రమ అని భావించారు చుట్టు పక్కల వాళ్ళు. చిత్రమేమిటంటే కొంత కాలానికి ఆమె రాధకి, కృష్ణుడికి అని పెట్టే లడ్డూలు, వెన్నముద్దలు అందరి ఎదురుగానే మాయమవడం మొదలు పెట్టాయి. దాంతో అందరికి అర్ధమైంది, నిజంగానే ఆమె చిన్న పిల్లలుగా రాధా కృష్ణులని అక్కడ దర్శిస్తోందని. అతి సూక్ష్మంగా ఆ నారాయణున్ని చిన్న పిల్లవానిగా చూస్తూ, పరాత్పర దివ్యస్వరూపమైన రాధాదేవిని బాలికగా దర్శిస్తూ నిజంగానే వారి సాన్నిధ్యంలో ధన్యురాలవుతుండేదిట. అయితే ఈ కధ ఇక్కడితో అయిపోలేదు. ఓ చిన్న సంఘటన జరిగింది - ఆమె భక్తికి పరీక్షో, భగవత్ తత్వాన్ని అర్ధం చేసుకోవాలనుకునే వారికి జవాబో! అనుకోకుండా పిల్లి వచ్చింది. చిన్నవాడైన కృష్ణుడు "అమ్మా! పిల్లి వచ్చిందే భయం! " అంటూ వచ్చాడు. ఏదో ధ్యాసలో వున్న ఆమె అందిట, "నువ్వు విశ్వరూపుడవి, నారాయణుడవి నీకు భయమేంటిరా! " అని. అంతే కృష్ణుడు, రాధా ఇద్దరూ మాయమై పోయారు. ఎంత వెతికినా కనిపించలేదు, ఎంత పిలిచినా రాలేదు.                      
[8:53 PM, 8/5/2017] Mahendra Vada: భక్తి తత్వం- ప్రత్యక్షానుభూతి(2): అలా ఆమె చింతిస్తుండగా కొంతకాలానికి చైతన్య మహా ప్రభువుల దర్శనమైందిట. ఆయన చెప్పారు, "అమ్మా! భగవంతుడిని నువ్వు చిన్ని వాడుగా భావించి, ప్రేమించి భక్తితో ఆహ్వానించావు. అలా చేసినన్నాళ్ళూ రాధాకృష్ణులు కూడా చిన్ని వారుగా హాయిగా దర్శనమిచ్చారు. ఎప్పుడైతే వారిని విశ్వరూపులుగా, పరాత్పర శక్తిగా దర్శించాలన్న తలంపు కలిగిందో, నీ లక్ష్యంతో పాటు భగవత్ స్వరూపంకూడా అంతుపట్టనంత పెద్దదిగా మారింది. సాధనలో, భక్తి మార్గంలో ఎంత సాధారణమైన, అనన్యమైన భక్తి వుంటే అంత త్వరగా సాక్షాత్కారం లభ్యమవుతుంది" . ఈ మాటలు విని ఆమె తన సాధనతో మళ్ళీ శ్రీ కృష్ణ సాక్షాత్కారాన్ని పొందిందిట. ఇదే ప్రహ్లాదుడి భక్తిలోనూ, కన్నప్ప భక్తిలోనూ కూడా వున్న రహస్యం అనిపిస్తుంది.

అతీతమైన పరబ్రహ్మ తత్వాన్ని ఎలా భావిస్తే అలా దర్శనమవుతుంది. నారద భక్తి సూత్రములు ప్రేమ దర్శనమును గురించి చెప్పాయి. ప్రార్ధనకు పైమెట్టు మంత్ర సాధన, మంత్ర సాధనకు పై మెట్టు ధ్యానము, ధ్యానమునకు పైమెట్టు భావ నిర్మితమైన తాదాత్మ్యం అని ప్రేమోపాసకుల నమ్మకము. నారద భక్తి సూత్రాలు ఇలా మొదలవుతున్నాయి. సా త్వస్మిన్ పరమప్రేమరూపా అమృత స్వరూపా చ యల్లబ్ద్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి అంటే భక్తి అనేది భగవానుని యందు పరమ ప్రేమ స్వరూపమైనది, అది అమృతమయమైనది, ఇది పొందిన మానవుడు సిద్ధపురుషుడగును, అమరుడగును, తృప్తుడగును అని అర్ధము.

Friday, July 14, 2017

idea Value added services Deactivation.

If you want to de-activate VAS of IDEA

 Send a S.M.S -STOP to 54300
Then they will show howmany VAS are there on you Phone
Type 1 and Send
After 30min.. Again repeat the same process.
Type 1 Etc.
De-activaion will be done.
Dont worry.


Sunday, July 2, 2017

మన విద్యా వ్యవస్థ-తీరు తెన్నులు

  మన విద్యా వ్యవస్థ-తీరు తెన్నులు
  • బాల్యం లో –తెలుగులో బోధన
  • బట్టీయం
  • వృత్తివిద్యాకోర్సుల సక్రమంగా నిర్వహించక పోవటం
  • detenstion విధానం లేకపోవటం.
  • ప్రభుత్వ పాటశాలలో సౌకర్యముల లేమి
  • అధ్యాపకులలో రాజేకయాలు- ఆధిపత్య పోరు
  • విద్యార్థులపై తలితండ్రుల గారాబం
  • పిల్లల పై మీడియా ప్రభావం
  • నిర్బంధ వ్యాయామవిద్య లేకపోవటం కావటంతో
  • నాణ్యత లేని వృత్తి విద్యాకోర్సులు
  • పోరుగుదేశాలకు వలస.
బాల్యం లో తెలుగులో విద్యాబోధన వల్ల పిల్లలు పాట్యంసాలను చక్కగా అర్థం చేసుకోగలరు. ఇంట్లో మాట్లడే భాష ,స్కూల్ లో బోధించే భాష- ఒకేటే కావటమే దీనికి కారణం. అలా, కాకుండా తను మాట్లాడే భాష ఒకటి ,  భోధన భాష వేరేగా ఉంటే, ప్రతి పదాన్ని ,తనకు తెలిసిన భాష లో తెలుసుకొని ,ఆపై భోధనా భాషా కు అలవాటు పడాలి. దీని వల్ల ,విద్యార్ధి పై చాలా చిన్న వయస్సులోనే ,చదువు గురుంచి ఒత్తిడి మొదలవుతుంది.
కేవలమ్ బట్టీయం వేయించటం వల్ల –ఉపయోగం వుండదు. పాట్యంసము లోని భావాన్ని అర్థం చేసుకోవటం వల్ల మాత్రమే వారికి విజ్ఞానము వస్తుంది. కాని, మరి మన విద్యాబోధన లో ఆ అవకాసం ఎంతవరకు ఉన్నది?  అలాగే, చదువు చెప్పే ఉపాధ్యాయులకు ఉన్న విద్యా ప్రమాణాలు ఏమరకు ఉన్నాయి అనేది ఆలోచించ వలసిన విషయం!
చదువుతూనే ఉపాధి పొందాలి, అన్న ఉద్దేశ్యం తో ఏర్పాటు చేసిన వృత్తి విద్యాకోర్సులు ,సరైన instuctor లేక ,తగు పరికరాలు లేక ఈ లక్యం ఎలా నీరు గారి పోతోందో చూస్తూనే వున్నాము!
  నిర్బంధ ఉత్తీర్ణత అనేది –మనము ఆసలు ఒప్పుకోము. కేవలం హాజరు వుంటే చాలు పై తరగతి కి పంపే విధానం కే మన ఓట్. కాదని మనలో ఎంత మంది గలరు.? ఇదివరకు S.S.L.C లో ఉత్తీర్ణత సాధిస్తే ఎంతో చక్కని విద్యాప్రమాణాలు కలిగిఉండే వారు, మరి ఇప్పుడో?
మన చూపు ఎంత సేపు ప్రైవేటు స్కూల్స్ వైపే , ప్రభుత్వ స్కూల్స్ వైపు చూడం. కారణం – సరియైన బోధన ప్రమాణాలు ఉంటాయో, లేదో ,సరైన టీచర్స్ ఉంటారో, లేరో అన్న భయం. కాని విద్యా కమిటీ ల ద్వార మనము మాట్లాడుకొని ,సమస్యలు పరిష్కరించుకోవాలి అని అనుకోము!
             దురదృష్టం ఏమంటే- చదువు చెప్పే మాస్టర్ల పై రాజకీయ నాయకుల ప్రభావం ఉంటోంది. ఇది వరకు ,ఏ రాజకీయాలైనా స్కూల్స్  కి  చేరేవి కావు. టీచర్స్ బదిలీలు ,పోస్టింగ్స్ ప్రతిదీ రాజకీయం అయిపొయింది .ఆ ప్రభావముతో టీచర్స్ లో కూడాగ్రూప్స్ కట్టడం జరుగుతోంది. ఇది ,తిరిగి విద్యార్థుల పై  ఆ ప్రభావం పడుతోంది.
ఇదివరకు మాస్టారు- విద్యార్ధి పై క్రమ శిక్షణలో భాగంగా ఒక దెబ్బ వేస్తె –కుర్రాడు ఏదో తప్పు చేసి ఉంటాడు అని భావించే వారు  తల్లి దండ్రులు . మరి ఇప్పుడో .......   ఇందుకు , ఇప్పుడు కేవలం ఒకరు లేక ఇద్దరు సంతానమే వుండటం కూడా కారణం... దాంతో వచ్చిన గారం.
పిల్లలపై మీడియా ప్రభావం ఎంతో .. ఉంటోంది. అందుబాట్లో.. స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ అందుబాటులోఉండటం తో , మంచి కి చెడుకి తేడా తెలియం లేదు.  చెప్పే పెద్దవాళ్ళు లేరు.  దీనికి తోడు తల్లిదండులు ఇద్దరు ఉద్యోగస్తులు కావటం తో ,పిల్లపై శ్రద్ద కూడా తగ్గుతోంది.
ఎన్ని ప్రభుత్వాలు మారినా ,వ్యాయామవిద్య ను నిర్బంధం చేయటం  లేదు . ఫలితముగా , పిల్లలు శారీరకముగా వ్యాయామమ్ లేకుండా ,కేవలం వీడియో గేమ్స్ కే పరిమితం అయి పోతున్నారు.
చదువుతూనే ,సంపాదన అనేది లక్యం గా వున్న వృత్తి విద్యా కోర్సులు- ఆచారణ లో అంతంత మాత్రమే గానే ఉన్నాయి . సరైన పరికరములు ,అధ్యాపకులు లేకపోవటం ఇందుకు కారణం కావచ్చు.
 ఇన్ని కష్టనష్టాలతో ,విద్యాభ్యాసం చేసిన విద్యార్థి - తన ఉద్యోగ జీవితమును ఇలాంటి వాతావరణం లో గడపటానికి ఇష్టపడక , తన మేధస్సుతో విదేశాలకు ఎగిరి పోతున్నారు.

ఇప్పటికైనా ,ప్రభుత్వాలు,తల్లి తండ్రులు,కలిసి పై సమస్యలకు పరిష్కారము కనుక్కోంటే మంచిది .