సరిత - రామనాథం ,రాజ్యలక్ష్మి లకు ఒక్కగానొక్క కూతురు . చిన్నప్పటి నుంచి చదువుల్లో ఫస్ట్ రాంక్ లో వుండేది . మధ్య తరగతి కుటుంబం కావటం వల్ల ,ఆడపిల్లను బాగా చదివించి తన కాళ్ళ మీద తను నిలబడేలా చేయాలనీ , తన స్తోమత కు ఎక్కువైనా ,సరిత ను చార్టెడ్ అకౌంటెంట్ చేసాడు రామనాథం గారు .సరిత కు చదువు అయ్యినవెంటనే , ఉద్యోగము వచ్చింది .
ఒక రోజు , తల్లి బాగా దగ్గుతూ వుంటే , ఏమిటమ్మా , ఏమి అయ్యింది అని తల్లి దగ్గరు వెళ్లి అడిగింది. తను చుస్తూ ఉండగానే, మళ్ళీ దగ్గుతూ తల్లి నోటినుండి రక్తం పడడం గమనించి , వెంటనే హాస్పిటల్ కు తీసికెళ్ళింది. టెస్ట్లు అన్ని చేసాక, రేపు వస్తే విషయం చెబుతామన్నారు, మర్నాడు, రామనాథం గారు, సరిత వెళ్లి విష యం కనుకున్ని, రామనాథం గారు కూలబడి పోయారు , ,రాజ్యలక్ష్మి గారి కి కాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజి .ఇంక రోజులే మిగిలాయి ! కొన్ని రోజులు మృత్యువు తో పోరాడుతూ రాజ్యలక్ష్మి గారు కన్నుమూసారు .
ఉద్యోగము లో చేరి కొద్ది రోజులే అవటం తో సెలవలు పెద్దగ దొరకలేదు సరితకు, దాంతో తల్లి పోయిన, 4 వ రోజే డ్యూటీ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది .
కార్యక్రమాలన్నీ అయిన తర్వాత, ఒక రోజు సడన్ గా తన బావమరిది సూర్యనారాయణ వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, తనువచ్చిన పని చెప్పడం మొదలెట్టాడు సూర్యనారాయణ " బావా ! అక్క పోయి ఎంతో కాలం కాలేదు! మరి నేను ఇలా మాటలాడ వచ్చో , లేదో తెలియదు . అంటూ నసుగుతున్నాడు. రామనాథం గారు ఫరవా లేదు, చెప్పు అనటం తో విషయం చెప్పాడు ." ఏమి లేదు బావా ! మా అబ్బాయి సతీష్ కు సంబంధాలు చూస్తున్నాము, బయటసంబంధాల కంటే అయిన వాళ్ళలో చూద్దామని, మీ అమ్మాయి సరిత ను మా ఇంటి కోడలుగా చెసుకుందామని . అడగటానికి వచ్చాను . అన్నాడు . దీనిలో కాదనటా నికి ఏమి లేదు - సతీష్ ,సరిత్ కు అన్ని విధాల జోడినే , కానీ, ఎందుకో రాజ్యలక్ష్మి బతికున్నప్పుడు ఈ ప్రస్తావన్ వచ్చినప్పుడు వద్దు అంది, ప్రస్తుతం , తనకు ఎవరు లేరు, పిల్ల ఎవరింటింకొ కంటే అయిన వాళ్ళఇంటి కేలెతే మంచిదే కదా అనిపిస్తోది, రామనాథం గారికి . చివరకి, సతీష్ కిచ్చి చేయటానకి .ఒప్పుకుంటూనే ప్రాధేయ పడుతూ అడిగారు బావమరిదిని "మరి నేను చేసుకోలేని రోజు న, నా కూతురింటికే రావాలి వస్తుంది , న చివరి రోజులు అమ్మాయి దగ్గరే పోవాలి, అందుకు మీ కిస్తామేనా" అని ." ఛ ,ఛ అదేమి మాటలు బావా ! నీ కూతురింటికి కాక మరి ఎక్కడి కెలతావు " , అంటూ భోరోస ఇచ్చాడు సుర్యనారాయణ. పెళ్ళి అయింది . కొద్దిరో జులు విడిగానే ఉన్నా చేసుకోలేక కూతురి ఇంటికి చేరారు రామనాథం గారు .
రెండు సంవసతరాలు గడిచేటప్పటికి తను ఇద్దరు పిల్లల కి తాత కూడా అయ్యరు. కూతురు కు భారం కాకుండా తన కొచ్చే పెన్శ్శన్లొ లో ఆరు వేలు ఇసున్నారు, మనవల్ల్తో చక్కగా కా లక్హేపం జరుగుతున్నది . సుర్యనారాయణ కి ఇవేమీ నచ్చలేదు, కూతురు పెట్టే తిండి బాగానే వంట పట్టింది అనటం , మనవళ్ళకు అనారోగ్యం చేస్తే అవి వాళ్ళకు తను తెచ్చే తినుబండారలవల్లె అని సూటి పోటి మాటలనటం జరుగుతోంది . ఇది నెమ్మదిగ అల్లుడు కుతురు మధ్య తగాదా ల దాక వెళ్ళింది దాంతో ,బాగా కలత చెందిన రామనాథంగారు, నెమ్మదిగా తన మకాం
వృ ధా శ్రామానికి మార్చారు . తన ఆదాయం కోసం, ఒక ఏటిమయం దగ్గర గార్డు గా చెరారు. మన అను కుని పిల్ల నిస్తే పరిస్తితి ఎలా తయారయిందో అని నిట్టూ ర్చటం తప్ప ఏమి చేయలేని నిస్సాయ స్థితి రామనాథం గారిది