Saturday, August 5, 2017

GK

🔲GK

వర్డ్                           ఫుల్ ఫార్మ్

1.e-mail                  ఎలక్ట్రానిక్ మెయిల్

2.WWW                  వరల్డ్ వైడ్ వెబ్

3.HTML                  హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్

4.HTTP                   హైపర్ టెక్ట్స్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్

5.URL                       యూనిఫారం రీసోర్స్ లోకేటర్

6.FTP                      ఫైల్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్

7.AI                       ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్

8.e-commerce        ఎలక్ట్రానిక్ కామర్స్

9.e-business            ఎలక్ట్రానిక్ బిజినెస్

10.e-money            ఎలక్ట్రానిక్ మనీ

11.Internet           ఇంటర్నేషనల్ నెట్ వర్క్

12.ERNET                ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్ వర్క్

13.DVD                     డిజిటల్ వర్సటైల్ డిస్క్

14.BPO                     బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్

15.KPO                     నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్

16.ALGOL               ఆల్గరిదమిక్ లాంగ్వేజ్

17.CDN                     కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్

18.LAN                     లోకల్ ఏరియా నెట్ వర్క్

19.SWAN                 స్టేట్ వైడ్ ఏరియా నెట్ వర్క్

20.WLL                     వైర్ లెస్ లోకల్ లూప్

21.WLAN                 వైర్ లెస్ లోకల్ ఏరియా నెట్ వర్క్

22.XML                   ఎక్స్ టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్

23.LCD                   లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే

24.Wi-Fi             వైర్ లెస్ ఫిడలిటి

25.DTH              డైరెక్ట్-టు-హోమ్

26.CDMA            కోడ్ డివిజన్ మల్టిబుల్ యాక్సెస్⁠⁠⁠⁠

మహాభారతం" నుండి నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు

"మహాభారతం" నుండి

నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు

1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.

2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:
శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.

3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:
పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.

4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.

5. ఎవరి పనులు వారే చేసుకోవడం:
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.

6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు

7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.

8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.

10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.

11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అ… Read more⁠⁠⁠⁠

భక్తి తత్వం- ప్రత్యక్షానుభూతి

[8:53 PM, 8/5/2017] Mahendra Vada: భక్తి- ప్రత్యక్షానుభూతి(1):భక్తిని గురించి మాట్లాడదాం. కొద్ది కాలం కింద బృందావనంలో ఒక గొప్ప సాధకురాలు వుండేదిట. ఇప్పటికి ఆ తపస్విని ఇంటిని సాధకులు పుణ్యక్షేత్రంలా దర్శిస్తూ వుంటారు. ఆమె రాధాకృష్ణులని చిన్నపిల్లలుగా, నిజమైన బిడ్డలుగా భావిస్తూ పూజిస్తుండేది. వాళ్ళకి పాలుపెరుగులు పెట్టడం, స్నానం చేయించడం ఇలా ఎన్నో! ఇవన్నీ ఏదో విగ్రహాలకు చేయిస్తున్నట్టు కాక నిజంగా రాధా కృష్ణులు వున్నట్టు, వారికి అన్నం ముద్దలు పెడుతున్నట్టు ప్రవర్తిస్తుండేది. మొదట్లో ఇదంతా భ్రమ, మతిభ్రమ అని భావించారు చుట్టు పక్కల వాళ్ళు. చిత్రమేమిటంటే కొంత కాలానికి ఆమె రాధకి, కృష్ణుడికి అని పెట్టే లడ్డూలు, వెన్నముద్దలు అందరి ఎదురుగానే మాయమవడం మొదలు పెట్టాయి. దాంతో అందరికి అర్ధమైంది, నిజంగానే ఆమె చిన్న పిల్లలుగా రాధా కృష్ణులని అక్కడ దర్శిస్తోందని. అతి సూక్ష్మంగా ఆ నారాయణున్ని చిన్న పిల్లవానిగా చూస్తూ, పరాత్పర దివ్యస్వరూపమైన రాధాదేవిని బాలికగా దర్శిస్తూ నిజంగానే వారి సాన్నిధ్యంలో ధన్యురాలవుతుండేదిట. అయితే ఈ కధ ఇక్కడితో అయిపోలేదు. ఓ చిన్న సంఘటన జరిగింది - ఆమె భక్తికి పరీక్షో, భగవత్ తత్వాన్ని అర్ధం చేసుకోవాలనుకునే వారికి జవాబో! అనుకోకుండా పిల్లి వచ్చింది. చిన్నవాడైన కృష్ణుడు "అమ్మా! పిల్లి వచ్చిందే భయం! " అంటూ వచ్చాడు. ఏదో ధ్యాసలో వున్న ఆమె అందిట, "నువ్వు విశ్వరూపుడవి, నారాయణుడవి నీకు భయమేంటిరా! " అని. అంతే కృష్ణుడు, రాధా ఇద్దరూ మాయమై పోయారు. ఎంత వెతికినా కనిపించలేదు, ఎంత పిలిచినా రాలేదు.                      
[8:53 PM, 8/5/2017] Mahendra Vada: భక్తి తత్వం- ప్రత్యక్షానుభూతి(2): అలా ఆమె చింతిస్తుండగా కొంతకాలానికి చైతన్య మహా ప్రభువుల దర్శనమైందిట. ఆయన చెప్పారు, "అమ్మా! భగవంతుడిని నువ్వు చిన్ని వాడుగా భావించి, ప్రేమించి భక్తితో ఆహ్వానించావు. అలా చేసినన్నాళ్ళూ రాధాకృష్ణులు కూడా చిన్ని వారుగా హాయిగా దర్శనమిచ్చారు. ఎప్పుడైతే వారిని విశ్వరూపులుగా, పరాత్పర శక్తిగా దర్శించాలన్న తలంపు కలిగిందో, నీ లక్ష్యంతో పాటు భగవత్ స్వరూపంకూడా అంతుపట్టనంత పెద్దదిగా మారింది. సాధనలో, భక్తి మార్గంలో ఎంత సాధారణమైన, అనన్యమైన భక్తి వుంటే అంత త్వరగా సాక్షాత్కారం లభ్యమవుతుంది" . ఈ మాటలు విని ఆమె తన సాధనతో మళ్ళీ శ్రీ కృష్ణ సాక్షాత్కారాన్ని పొందిందిట. ఇదే ప్రహ్లాదుడి భక్తిలోనూ, కన్నప్ప భక్తిలోనూ కూడా వున్న రహస్యం అనిపిస్తుంది.

అతీతమైన పరబ్రహ్మ తత్వాన్ని ఎలా భావిస్తే అలా దర్శనమవుతుంది. నారద భక్తి సూత్రములు ప్రేమ దర్శనమును గురించి చెప్పాయి. ప్రార్ధనకు పైమెట్టు మంత్ర సాధన, మంత్ర సాధనకు పై మెట్టు ధ్యానము, ధ్యానమునకు పైమెట్టు భావ నిర్మితమైన తాదాత్మ్యం అని ప్రేమోపాసకుల నమ్మకము. నారద భక్తి సూత్రాలు ఇలా మొదలవుతున్నాయి. సా త్వస్మిన్ పరమప్రేమరూపా అమృత స్వరూపా చ యల్లబ్ద్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి అంటే భక్తి అనేది భగవానుని యందు పరమ ప్రేమ స్వరూపమైనది, అది అమృతమయమైనది, ఇది పొందిన మానవుడు సిద్ధపురుషుడగును, అమరుడగును, తృప్తుడగును అని అర్ధము.